న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏడాది నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల కానుంది.
యూపీఎస్సీ విడుదల చేసిన పరీక్ష కేలండర్ ప్రకారం అదే రోజు నుంచి ప్రారంభించి, మార్చి 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహిస్తారు.