ఎన్నికల ప్రచారానికి మూగజీవాలను కూడా వాడేస్తున్నారు. ఫ్రీ గా దొరికే పబ్లిసిటీ కోసం దేనికైనా వెనకడాటం లేదు. గెలుపు కోసం ఎలాంటి హామీలైనా ఇస్తారని నిన్నటివరకు ప్రజలు అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రచారానికి ఏదైనా వాడేస్తారని నిరూపించారు ఉత్తరప్రదేశ్ కి చెందిన రాజకీయనేతలు.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాయ్ బరేలీ, బాలియా నియోజకవర్గాల అభ్యర్థులు వింత పోకడలకి పోయారు. కుక్కలకి ప్రచార పోస్టర్లు అంటించారు. తమకే ఓటు వెయ్యాలని పోస్టర్లపై కోరారు. విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు ఫైర్ అయ్యారు. అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను అభ్యర్థులు తోసిపుచ్చుతున్నారు. మేము వాటిని హింసించలేదని, ఆహారం పెట్టి పోస్టర్లు అంటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.