యూపీలో యోగి నేతృత్వంలో బీజేపీ సర్కార్ కొలువైంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, మంత్రుల శాఖల కేటాయింపు కూడా పూర్తైంది. అయితే.. మంత్రులు కొత్త డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. వ్యక్తిగత సిబ్బంది కింద ఉద్యోగులను కేటాయించే సమయంలో మహిళా సిబ్బందిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు కేటాయించవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నారు. కేవలం పురుషులను మాత్రమే వ్యక్తిగత సిబ్బంది కోటా కింద కేటాయించాలని తెగేసి చెబుతున్నారు. వ్యక్తిగత సిబ్బంది కోటాలో మహిళా సిబ్బందిని కేటాయిస్తే… ప్రాక్టికల్గా కొంత ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. నూతన మంత్రులు తమ తమ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సెక్రెటేరియట్ సిబ్బంది… మహిళా సిబ్బందిని 20 శాతం మేర పెంచారు.
అయితే మంత్రులు చేసిన విజ్ఞప్తిపై సచివాలయ అధికారులు సానుకూలంగానే స్పందించారు. వ్యక్తిగత సిబ్బందిగా మహిళలు వద్దంటే… తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే సహజంగా.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు కొత్త సిబ్బందిని కేటాయిస్తుంటారు. అయితే.. ఈ సారి మాత్రం తమకు పాత సిబ్బందే కావాలని మంత్రులు కోరుతున్నారు.