బారాబంకి: ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్ శర్మ శివలింగాన్ని అపవిత్రం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. బారాబంకి లోధేశ్వర్ మహదేవ్ ఆలయంలో శివలింగం అర్ఘ(బేస్) వద్ద పుజారి నీళ్లు పోస్తుండగా.. సతీశ శర్మ తన చేతులను కడుగుతున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ధ్వజమెత్తాయి.
మత వ్యతిరేక చర్యలకు పాల్పడిన, శివుడిని అవమానించిన మంత్రి సతీశ్ శర్మ వెంటనే పదవి నుంచి తొలగించాలని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ డిమాండ్ చేశారు. ‘అధర్మ’ మంత్రిని సీఎం యోగి ఎప్పుడు తొలగిస్తారని ఎస్పీ నేత సునీల్ సింగ్ సజన్ ప్రశ్నించారు. మతం పేరుతో మొదట ఓట్లు అడగడం, తర్వాతి ఇటువంటి చర్యలకు పాల్పడటం బీజేపీ నైజం అని మండిపడ్డారు. అయితే శివలింగం వద్ద చేతులు కడుగడాన్ని మంత్రి సమర్థించుకొన్నారు.