లక్నో: సాధువుల సలహాతో మోక్షంతోపాటు డబ్బు పొందేందుకు ఒక వ్యక్తి సజీవంగా సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో ఆరు అడుగుల లోతులో భూమి లోపల ఉన్న ఆ వ్యక్తిని రక్షించారు. ఆ వ్యక్తితోపాటు ఆ సలహా ఇచ్చిన ముగ్గురు సాధువులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసివాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన శుభం గోస్వామికి ముగ్గురు సాధువులు ఒక సలహా ఇచ్చారు. శరన్నవరాత్రులు ప్రారంభం ముందు రోజున సమాధిలో కూర్చుంటే మోక్షం, జ్ఞానోదయంతో పాటు డబ్బులు లభిస్తాయని చెప్పారు. ఇది నమ్మిన గోస్వామి ఆరు అడుగుల లోతులో తవ్విన గోతిలోకి దిగాడు. ఆ గొయ్యిపై కర్రల ఆసరాతో మట్టిని కప్పారు.
మరోవైపు స్థానికుల ద్వారా ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆ సమాధి వద్దకు వెళ్లారు. కర్రలపై కప్పిన మట్టిని తొలగించారు. గోతి లోపల ఉన్న గోస్వామిని బయటకు తెచ్చారు. సమాధి కావాలని చెప్పిన ముగ్గురు సాధువులతోపాటు సమాధిలో కూర్చొన్న గోస్వామిని కూడా అరెస్ట్ చేశారు. కాగా, సమాధిలో ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी के उन्नाव में एक युवक को पुजारी ने पट्टी पढ़ाई कि “तुम ज़मीन के अंदर भू समाधि ले लो बहुत धन प्राप्त होगा” फिर युवक को 6 फुट गढ्ढा खोद कर गाड़ दिया गया … पुलिस को पता चला तो युवक को भू समाधि से निकाला और अब पुजारी और युवक दोनों जेल में हैं @ndtv pic.twitter.com/B2IfFjRSgw
— Saurabh shukla (@Saurabh_Unmute) September 27, 2022