లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్కు చెందిన కలెక్టర్ వరద బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జొమాటోను ప్రభుత్వం నిర్వహించడం లేదన్న ఆయన ప్రతి ఇంటికి ఆహారం, సహాయక సామగ్రి పంపిణీ చేయడం కుదరదని అన్నారు. స్థానికులు ఒక సమయం నిర్ణయించుకుంటే శిబిరం వద్ద ఆహారం వండి వడ్డిస్తారని చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ వరద బాధితులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో అంబేద్కర్ నగర్ జిల్లా కలెక్టర్ శామ్యూల్ పాల్ ఆ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులతో సమావేశమై వారితో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల వద్దకు వారు రావాలని చెప్పారు. స్థానికులు ఒక సమయం నిర్ణయించుకుంటే అక్కడే ఆహారం వండి వడ్డిస్తారని తెలిపారు. ‘జొమాటోను ప్రభుత్వం నిర్వహించడం లేదు. ప్రతి ఇంటికి ఆహారం, సహాయక సామగ్రి పంపిణీ చేయడం కుదరదు’ అని అన్నారు. ప్రజలకు సహాయం కోసం వరద సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడికి వస్తేనే ఆహారం వండి పంపిణీ చేస్తామని, జొమాబో మాదిరిగా ఇంటింటికి ఆహారం పంపిణీ చేయబోమని ఆయన అన్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కలెక్టర్ శామ్యూల్ పాల్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘కలెక్టర్ సార్ కోపం తెచ్చుకోకండి. వరద బాధితులు ఇప్పటికే కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారికి ‘జొమాటో’ అంటే ఏమిటో కూడా తెలియదు. వారికి సహాయం చేయండి. వారికి అర్థమయ్యేలా చెబితే సంతోషిస్తారు’ అని ఒకరు వ్యాఖ్యానించారు.
उत्तर प्रदेश-
DM साहब नाराज़ न होइये – बाढ़ पीड़ित पहले से ही आपदा झेल रहें हैं,उन्हें ज़ोमैटो क्या है पता भी नहीं होगा,उनकी मदद करिये,जनता मात्र मधुर वचनों से खुश हो जाती है..
सैमुअल पॉल एन अम्बेडकर नगर के कलेक्टर हैं !! pic.twitter.com/wyJicNjGBj
— Gaurav Singh Sengar (@sengarlive) October 13, 2022