లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగింపు దశకు చేరుకున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ చేజేతులా అధికారాన్ని కోల్పోయింది. మిగితా నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
అయితే, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పంకజ్సింగ్.. అఖండ మెజారిటీ సాధించారు. నోయిడా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన ఆయన సమాజ్వాది పార్టీ అభ్యర్థిపై ఏకంగా లక్షా 79 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎస్పీ అభ్యర్థి సునీల్ చౌదరి కేవలం 26 వేల ఓట్లు మాత్రమే సాధించి రెండో స్థానానికి పరిమితమయ్యారు.