హైదరాబాద్ : సీఎస్ఐఆర్-ఎన్సీఎల్కు చెందిన ఫిజికల్ అండ్ మెటీరియల్స్ కెమిస్ట్రీ విభాగపు చైర్మన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి డాక్టర్ బీఎల్వీ ప్రసాద్ సెంటర్ ఫర్ నానో అండ్ పాఫ్ట్ మేటర్ సైన్సెస్(CeNS), బెంగళూరు డైరెక్టర్గా నియమితులయ్యారు. డాక్టర్ ప్రసాద్ తన ఎంఎస్సీ కెమిస్ట్రీని హైదరాబాద్ యూనివర్సిటీని పూర్తిచేశారు. అనంతరం 1997లో వర్సిటీ నుండి పీహెచ్డీ పొందారు.
ప్రసాద్ అణువుల ఆధారిత అయస్కాంత పదార్థాలు, కాంజుగేటెడ్, నాన్ కాంజుగేటెడ్ ఆర్గానిక్ రాడికల్స్కు చెందిన సైద్ధాంతిక అవగాహనపై పనిచేస్తున్నట్లు హైదరాబాద్ వర్సిటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్లోని టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టోరల్ స్టంట్స్ సమయంలో నానోమెటీరియల్స్పై పరిశోధన చేశారు. అనంతరం అమెరికాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో పరిశోధనలను కొనసాగించారు.