ఆగ్రా : కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్పీసింగ్ బఘేల్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఆరేళ్ల కిందట అనుమతి లేకుండా ఎత్మాద్పూర్లో సమావేశాన్ని నిర్వహించిన కేసులో అభియోగాల నమోదు కోసం కోర్టు ఎదుట హాజరవగా.. తుదిపరి విచారణను జూన్ 7న విచారణ చేపట్టనున్నది. అనుమతి లేకుండా సభ నిర్వహించడంతో పాటు 144 సెక్షన్ను ఉల్లంఘించినందుకు 2016లో కేంద్ర సహాయ మంత్రితో పాటు పలువురిపై ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో కేంద్రమంత్రి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై మే 12న విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు జడ్జి దరఖాస్తును తిరస్కరించగా.. శనివారం అభియోగాల నమోదు కోసం ఆయన కోర్టుకు హాజరయ్యారు. కేసు ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందిలను అరెస్టు చేయకపోవడంతో 2016, ఏప్రిల్ 5 పంచాయితీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ బఘేల్ ప్రకటించారు. అదే నెల 11న స్టేషన్ రోడ్డులోని నాగ్లా గంగారాం తిరహే వద్ద అనుమతి లేకుండా మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ కేసులో సెక్షన్ 144ను ఉల్లంఘించినందుకు ఎస్పీ సింగ్ బఘెల్తో పాటు పలువురిపై ఎస్హెచ్వో సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.