న్యూఢిల్లీ: భారత్ కోవిడ్ టీకాలను విదేశాలకు సరఫరా చేయనున్నది. వచ్చే నెల నుంచి టీకాల ఎగుమతిపై దృష్టి పెట్టనున్నది. వ్యాక్సిన్ మైత్రి ప్రాజెక్టు కింద ఈ చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్లో తయారయ్యే వ్యాక్సిన్లను అందించనున్నామని, డబ్ల్యూహెచ్వో చేపడుతున్న కోవాక్స్ ప్రాజెక్టుకు సహకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే నెలలో అదనంగా 30 కోట్ల కోవిడ్ డోసులు రానున్నట్లు ఆయన చెప్పారు. బయోలాజికల్ ఈ సంస్థ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేయనున్నదని, దాంతో అందుబాటులోకి కొత్త టీకాలు వస్తాయని, ఇతర కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు మంత్రి మాండవీయ చెప్పారు.