హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ను సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్కు చెందిన కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తుల పోస్టులకుగాను 31 మంది ఉన్నారు. ఖాళీల భర్తీ చర్యల్లో భాగంగా ఇద్దరు హైకోర్టు సీజేలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనున్నది. ఈ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే వీరిద్దరూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానున్నారు. ఇదే జరిగితే తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీ నవీన్రావు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉంటాయి.