ఢిల్లీలోని ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్సైన్సెస్’ (ఏఐఐపీహెచ్ఎస్) అనేదిఫేక్ యూనివర్సిటీ అని యూజీసీ స్పష్టంచేసింది. ఇందులో చేరొద్దంటూ నోటీసులు కూడా జారీచేసింది. మే 27, 2022న విద్యార్థులు, సాధారణ ప్రజలు, తల్లిదండ్రులకోసం ఈ నోటీసు జారీ చేశారు. నోటీసు ప్రకారం.. ఏఐఐపీహెచ్ఎస్.. యూజీసీ యాక్ట్, 1956ని ఉల్లంఘించే వివిధ డిగ్రీ కోర్సులను అందిస్తోంది.
యూజీసీ 1956 చట్టంలోని సెక్షన్ 22 (1) ప్రకారం ఏఐఐపీహెచ్ఎస్ను కమిషన్ నకిలీ విశ్వవిద్యాలయంగా పరిగణించింది. యూజీసీ చట్టంలోని సెక్షన్ 2 (ఎఫ్), సెక్షన్ 3 ప్రకారం ఏఐఐపీహెచ్ఎస్ను కమిషన్ గుర్తించలేదని, ఆ యూనివర్సిటీకి విద్యార్థులకు ఏ విధమైన డిగ్రీని ప్రధానం చేసే అధికారం కూడా లేదని కమిషన్ పేర్కొంది.ఈ ఫేక్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా జారీ చేసిన నోటీసులపై యూజీసీ సెక్రటరీ రజనీశ్ జైన్ సంతకం చేశారు. ‘సాధారణ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వాటాదారులు పైన పేర్కొన్న అటానమస్ సంస్థలో అడ్మిషన్ తీసుకోవద్దు’ అని ఈ పబ్లిక్ నోటీసు ద్వారా హెచ్చరిస్తున్నాం” అని నోటీసులో పేర్కొన్నారు.