ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసమైన ‘వర్షా’ను ఖాళీ చేశారు. ముంబై సబర్బన్ బాంద్రాలోని సొంత నివాసం ‘మాతోశ్రీ’కు మకాం మార్చారు. సీఎం అధికార నివాసంలోని ఆయన లగేజీని సిబ్బంది ప్యాక్ చేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సాయంత్రం ఫేస్బుక్ లైవ్లో ప్రజలనుద్దేశించి ఉద్వేగంతో ప్రసంగించారు. సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదన్న ఉద్ధవ్, సూరత్కు వెళ్లి అక్కడ ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నారని రెబల్ నేతలను ప్రశ్నించారు. వెన్నంటే ఉంటామని చెప్పి ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీశారు. తమను బలవంతంగా తీసుకెళ్లారని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారని, అయితే ఆ విషయాలు తనకు అవసరం లేదన్నారు.
శివ సైనికులే తనకు ముఖ్యమని, వారు ఏం చెబితే అది చేస్తానని అన్నారు. రాజీనామాకు కూడా సిద్ధమని, లేఖ కూడా కార్యాలయంలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే దీనిని తీసుకుని గవర్నర్కు ఇవ్వవచ్చని తెలిపారు. అవసరమైతే పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. ఒక శివ సైనికుడు సీఎం అయితే సంతోషిస్తానని అన్నారు.
#WATCH | Luggage being moved out from Versha Bungalow of Maharashtra CM Uddhav Thackeray in Mumbai pic.twitter.com/CrEFz729s9
— ANI (@ANI) June 22, 2022