న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం విషయంలో ఇద్దరు శిల్పులు వాదనకు దిగారు. విగ్రహ రూపకల్పనలో గొప్పదనం నాదంటే నాది అని ఇద్దరు కళాకారులు ప్రకటనలు ఇచ్చారు.
తాను విగ్రహ నమూనాను రూపొందించానని శిల్పి నరేశ్ కుమావత్ పేర్కొనగా.. దీన్ని ఖండిస్తూ అరుణ్ యోగిరాజ్ అనే మరో శిల్పి సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెట్టారు.