న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో ఓ కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కున్న ఇద్దరని బయటికి తీశారు. తీవ్రంగా గాయపడినవారిని దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. శుక్రవారం ఉదయం 4.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
గతంలో కూడా ఢిల్లీలోని నంద్నగరి ప్రాంతంలో రెండంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. అదేధింగా రెండు నెలల క్రితం సబ్జిమండి ప్రాంతంలో నాలుగంతస్తుల బిల్డింగ్ కుప్పకూలడంతో ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు.