స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘సూరత్’, ‘ఉదయగిరి’ అనే రెండు యుద్ధనౌకలు ముంబైలోని మజగావ్ డాక్ యార్డులో మంగళవారం జల ప్రవేశం చేశాయి.
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ కంపెనీ తెలిపింది. రెండు నౌకల డిజైన్ను డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ సంస్థ వీటిని నిర్మించింది.