Whatsapp | న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ను గుర్తించేందుకు త్వరలో వాట్సాప్లోనూ ట్రూకాలర్ సేవలను ప్రారంభించనున్నట్టు ట్రూకాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలన్ మమెది తెలిపారు. గత రెండు వారాలుగా భారత్లో వాట్సాప్ ద్వారా స్పామ్ కాల్స్ వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారు.
అందుకే, మెసేజింగ్ యాప్లలోనూ తమ సేవలు అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు చెప్పా రు. 2021లో ట్రూకాలర్ సంస్థ రూపొందించిన ఒక నివేదిక ప్రకారం భారత్లో సగటున ఒక్కొక్కరికి నెలకు 17 స్పామ్ కాల్స్ వస్తున్నాయి. ఏఐ ఉపయోగించి స్పామ్ కాల్స్ను నివారించాలని కేంద్రం టెలికం కంపెనీలకు సూచించింది.