న్యూఢిల్లీ: సస్పెన్షన్కు గురైన విపక్ష ఎంపీలు .. పార్లమెంట్(Parliament) గేటు వద్ద ఇవాళ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ ఆందోళనలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ను అనుకరిస్తూ విమర్శలు చేశారు. మకర ద్వారం మెట్ల వద్ద అనేక మంది ఎంపీల మధ్య కూర్చున్న కళ్యాణ్ బెనర్జీ.. తనదైన స్టయిల్లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు.
చైర్మెన్ జగదీప్ ధన్కర్ను కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేశారు. ఆ సమయంలో అక్కడే నిలబడి ఉన్న రాహుల్ గాంధీ.. తృణమూల్ నేతను వీడియో తీశారు. నా వెన్నుపూస నిటారుగా ఉంది, నేను చాలా పొడుగ్గా ఉన్నానంటూ రాజ్యసభ చైర్మెన్ను విమర్శిస్తూ తృణమూల్ ఎంపీ తన మిమిక్రీలో ఎక్కిరించారు.
విపక్ష ఎంపీలు చేసిన వెకిలి ప్రదర్శనను చైర్మెన్ జగదీప్ ధన్కర్ తప్పుపట్టారు. సస్పెండ్ అయిన ఎంపీల ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదన్నారు. ఇది సిగ్గు చేటు అని ధన్కర్ తెలిపారు. చైర్మెన్ను మిమిక్రీ చేయడం, స్పీకర్ను అనుకరించడం.. ఇది దారుణమని, చాలా సిగ్గుచేటు చర్య అని ధన్కర్ అన్నారు.
If the country was wondering why Opposition MPs were suspended, here is the reason…
TMC MP Kalyan Banerjee mocked the Honourable Vice President, while Rahul Gandhi lustily cheered him on. One can imagine how reckless and violative they have been of the House! pic.twitter.com/5o6VTTyF9C
— BJP (@BJP4India) December 19, 2023
ఇవాళ కూడా పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేశారు. లోక్సభలో 49 మందిని సస్పెండ్ చేశారు. దీంతో సస్పెండ్ అయిన వారి సంఖ్య 142కు చేరుకున్నది. స్మోక్ అటాక్పై మోదీ, షా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.