కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ అర్జున్ సింగ్ (Arjun Singh) ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో తిరిగి చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీని కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. టీఎంసీకి చెందిన టాప్ నేత కూడా తనతోపాటు బీజేపీలో చేరుతారని చెప్పారు. తన లోక్సభ నియోజకవర్గమైన బరాక్పూర్ మరో సందేశ్కలిగా మారకుండా నిరోధించడమే తన లక్ష్యమని అన్నారు.
కాగా, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా నుంచి సిట్టింగ్ ఎంపీ అర్జున్ సింగ్ను టీఎంసీ తప్పించింది. దీంతో పార్టీ పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తొలుత టీఎంసీ నాయకుడైన 61 ఏళ్ల అర్జున్ సింగ్ 2019 లోక్సభ ఎన్నికల ముందు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన ఆయన బారక్పూర్ స్థానం నుంచి గెలిచారు. ఆ తర్వాత 2022 మేలో తిరిగి టీఎంసీ గూటికి చేరుకున్నారు. ఎంపీగా కొనసాగారు. లోక్సభ ఎన్నికల ముందు మరోసారి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.