చండీగఢ్, ఆగస్టు 3: కిలో టమాటా ధర రూ.200 తాకటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. టమాటాను కొనాలంటే సామాన్యులు జంకుతున్నారు. చండీగఢ్లో కిలో టమాటా రూ.200 దాటడంతో రాజ్భవన్ వంటకాల్లో టమాటాను వాడొద్దని పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆదేశాలు జారీ చేశారు. టమాటా కొనుగోలు తగ్గిస్తే.. ధరలు వాటంతటవే దిగివస్తాయని, ప్రజలు కూడా తాత్కాలికంగా కొనటం మానేయాలని గవర్నర్ సూచించారు. ఈ మేరకు రాజ్భవన్ గురువారం ఓ ప్రకటన జారీ చేయటం గమనార్హం.