షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీకి మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)తోపాటు అన్ని పార్టీల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఎన్పీపీ పావులు కదుపుతుండగా.. కూటమిగా అధికార పార్టీని ఓడించాలని చిన్నాచితక ప్రతిపక్ష పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.
పశ్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మేఘాలయలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగాను 52 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి తొలి జాబితాను విడుదల చేసింది. కాగా, మేఘాలయలో మార్చి ఆఖరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.