న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆదివారం ప్రధాని మోదీకి ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
‘మన్ కీ బాత్లో ఇతర అంశాలపై మాట్లాడే మీరు.. పవర్ఫుల్ బీజేపీ వేటగాళ్ల నుంచి భారత అథ్లెట్ బేటీలను ఎందుకు రక్షించలేదో చెప్పండి. అదేవిధంగా సుప్రీంకోర్టు విధించిన కాలపరిమితిలోగా సెబీ అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ ఆరోపణలపై సెబీ ఎందుకు విచారణ పూర్తి చేయలేకపోయిందో చెప్పండి’ అని నిలదీశారు.