న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను.. ఝాన్సీ రైల్వే స్టేషన్లో రైలు నుంచి బలవంతంగా కిందికి దించేశారు. మతమార్పుడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో.. ఏబీవీపీ సభ్యులు ఆ నన్స్ను కిందకు దించేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు క్రైస్తవ సన్యాసినులతో పాటు వారి వద్ద సేవకులుగా ఉన్న మరో ఇద్దర్ని కూడా ట్రైన్ నుంచి నెట్టివేశారు. రైల్వే స్టేషన్లో విచారణ చేపట్టిన తర్వాతే మళ్లీ రైలు ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ ఘటన పట్ల చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. శుక్రవారం రోజున ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. క్రైస్తవ సన్యాసినులను రైలు దించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఓ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. హరిద్వార్-పురి ఉత్కల్ ఎక్స్ప్రెస్లో నన్స్ ప్రయాణించారు. 25 సెకన్ల వీడియోలో ఆ సైన్యాసినులను కొంత మంది చుట్టుముట్టారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారు.