రామ్పూర్: జమ్మూకశ్మీర్లో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రాంపూర్ సెక్టార్లో యూరి వద్ద ఉన్న ఎల్వోసీ దగ్గర ఈ ఎదురుకాల్పులు జరిగాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఇటీవల భారత భూభాగంలోకి చొరబడినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. వారి వద్ద నుంచి అయిదు ఏకే-47 రైఫిళ్లు, 8 పిస్తోళ్లు, 70 హ్యాండ్ గ్రేనేడ్లను రికవరీ చేశారు. హత్లాంగా ఫారెస్ట్ వద్ద చొరబాటుదారులు కదులుతున్నట్లు గుర్తించామని శ్రీనగర్ చినార్ కార్ప్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే తెలిపారు. ఆ క్రమంలో చేపట్టిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆయన వెల్లడించారు.