మంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. ముగ్గురు విద్యార్థినులపై ఒక యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరికి ముఖంపై తీవ్ర కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దక్షిణ కన్నడ జిల్లా కడబలోని ఒక ప్రీ యూనివర్సిటీ కాలేజీలో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు 23 ఏండ్ల అబిన్ షిబి అనే యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు కేరళలోని మలప్పురం జిల్లా నిలంబూర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాధిత యువతుల వయసు 17-19 మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
బాధితుల్లో ఒకరిని తాను ప్రేమిస్తున్నానని, ఆమె తనతో శృంగానికి ఒప్పుకోకపోవడంతోనే తాను ఈ దారుణానికి పాల్పడినట్టు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే తాను ఒకరిని లక్ష్యంగానే యాసిడ్ దాడి చేశానని, ఆమె పక్కన కూర్చున్న ఇద్దరిపై కూడా అది పడిందని అతను పేర్కొన్నాడు. నిందితుడు టార్గెట్ చేసిన బాలికకు ముఖంపై తీవ్ర కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయని, చికిత్స నిమిత్తం బాధితులను వెంటనే దవాఖానకు తరలించినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిందితుడు తన సొంత పట్టణంలో ఎంబీఏ చదువుతున్నాడని, అత ను టార్గెట్ చేసిన విద్యార్థిని కూడా కేరళ చెందిన వ్యక్తేనని, చదువు నిమిత్తం కర్ణాటకకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.