ముంబై: లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఆదివారం ముంబైలో భారీ ప్రదర్శన చేపట్టారు. మతమార్పుడులను అడ్డుకునేందుకు ..మతం పేరిట భూముల్ని కబ్జా చేయడాన్ని నిలిపేందుకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఈ ర్యాలీ నిర్వహించారు. హిందూ జన ఆక్రోశ్ మోర్చా పేరుతో ర్యాలీ చేపట్టారు. దాదర్లోని శివాజీ పార్క్ నుంచి పార్లేలోని కామ్గర్ మైదాన్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ప్రదర్శన జరిగింది.
నిరసనకారులు లవ్ జిహాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం ఏకనాథ్ షిండేతో పాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లవ్ జిహాద్కు అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాలు తయారు చేసిన చట్టాలను పరిశీలించి, తాము కూడా ఓ చట్టాన్ని రూపొందించనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.