న్యూఢిల్లీ, మే 9: అత్యున్నత పదవులు పొందడానికే మేధావులుగా చెప్పుకొనే ముస్లింలు సహనం ముసుగు తొడుక్కుంటారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సహనం గల ముస్లింలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చన్నారు. వారు కూడా ప్రజా జీవితం గడపడం కోసమే ఆ ముసుగు తొడుక్కుంటారని అన్నారు. సోమవారం ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మేధావులుగా చలామణి అయ్యే ముస్లింలు తమ పదవీ కాలం పూర్తయిన తర్వాత ముసుగులు తొలగిస్తారని సత్యపాల్ వ్యాఖ్యానించారు. సమాచార కమిషనర్ ఉదయ్ మధుకర్ ఇదే సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం ఛాందస వాదానికి వ్యతిరేకంగా భారత్ పని చేయాలని కోరారు. ఈ పోరాటంలో సహనం గల ముస్లింలను భాగస్వాములను చేయాలని కోరారు. అయితే ఆయన మాట్లాడిన వెంటనే సత్యపాల్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.