హైదరాబాద్ : భారతదేశంలో చాలా ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడినప్పటికీ, మహమ్మారితో మన పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొనుగోలుదారులు, విక్రయ భాగస్వాములు, మా ఉద్యోగులు సురక్షితంగా ఉండాలి… వారి సంక్షేమమే మాకు ప్రాధానం అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారి అన్నారు.చిన్న,మధ్యతరహా బిజినెస్ బ్రాండ్స్ తో కలిసి మేము మా కస్టమర్లకు విస్తృతశ్రేణిని, ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఇంటివద్ద సురక్షితంగా ఉంటూనే సంబరాలు జరుపుకోవాలని చూస్తున్న కొనుగోలుదారుల కోసం మేము రాబోయే పండుగ సీజన్ కోసం సంసిద్ధమవుతున్నాము. ఫ్యాషన్, గ్రోసరీ, హోమ్ నీడ్స్ , స్మార్ట్ ఫోన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ,స్టడీ ఫ్రమ్ హోమ్ కు కావలసిన రకాల ఉత్పత్తుల విస్తృతశ్రేణి కోసం కొనుగోలుదారులు, అగ్రశ్రేణి బ్రాండ్ల లో డీల్స్, ఆఫర్లు అందిస్తున్నాం” అన్నారు.
స్థానిక దుకాణాలు,వేలాదిమంది చిన్నతరహా వ్యాపారవర్గాలవారికి, కష్టకాలంలో వారి వ్యాపారాలకు సహాయం చేస్తూ, వారి నుంచి షాపింగ్ చేసే అవకాశం ఇస్తున్నామని తివారీ పేర్కొన్నారు. డిమాండును పరిశీలించి చూస్తే, ఈ సీజన్ మంచి బలంగా ఉండగలదని మేము భావిస్తున్నాము. ఈ దీపావళి మా విక్రేతలకు మాత్రమే కాక మా వినియోగదారులకు కూడా చాలా బాగుంటుందని మేము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు.
పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది, ఇటీవలే మేము ఓనమ్, రాఖీ షాపింగ్ లను A.in పై ముగించాము. ఇక విక్రేతల విషయానికి వస్తే, మరిన్ని స్థానిక దుకాణాలు ఆన్లై న్లో విక్రయాల కోసం ముందుకు వస్తున్నాయి. ఈ వైఖరిని మేము గత కొద్ది నెలలుగా గమనిస్తున్నాము. దీపావళి పండుగ సందర్భంగా ఇది అత్యధిక స్థాయికి చేరుకోగలదని మేము విశ్వసిస్తున్నాము. మరొక విషయం ఏమిటంటే, ఆన్లై న్లో విక్రయించేందుకు ముందుకు వస్తున్న విక్రేతలు చాలా మంది, A.in పై షాపింగ్ చేసే కొనుగోలుదారులు చిన్న పట్టణాలకు చెందినవారు.
ఇక విభాగాల విషయానికి వస్తే, కొనుగోలుదారులు ఆన్లైన్ షాపింగ్ చేయటం మొదలుపెట్టినప్పటినుంచి వేగాన్ని అందుకున్న విక్రయాలు కిరాణా సామాగ్రులు. గత 12 నెలల కాలంలో విపరీతంగా విక్రయాలు పెరిగిన కొన్ని కొత్త విభాగాల్లో పర్సనల్ గ్రూమింగ్ (వ్యక్తిగత సౌందర్యసాధనాలు), క్రీడా సామాగ్రులు మొదలైనవి చాలా విభాగాలు అభిరుచులకు అనుబంధమైనవి.
ఈ విభాగాలు గత 18 నుంచి 20 నెలల మధ్యలో అభివృద్ధి చెందాయి. ఈ ట్రెండ్ దీపావళి సమయంలో అత్యధిక స్థాయికి చేరుకోగలదని మేము భావిస్తున్నాము. అంతే కాక, ఫ్యాషన్ , సౌందర్యసాధనాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాల వ్యాపారాలలో గత ఏడాది దీపావళి తరహాలోనే వ్యాపారాలు ఉండొచ్చని మేము భావిస్తున్నాము”అని తివారీ అన్నారు.