Monsoon | న్యూఢిల్లీ : నైరుతి రుతు పవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని జూన్ 4న రావొచ్చునని మేలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆదివారం రుతు పవనాల జాడ లేకపోవడంతో ఐఎండీ స్పందించింది. ‘అరేబియా సముద్రంపై పశ్చిమ గాలుల ఉధృతి పెరిగింది.
దాదాపు 2.1 కి.మీ ఎత్తున సముద్రంపై మేఘాలు విస్తరించాయి. మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకొచ్చు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. రుతు పవనాలు ఆలస్యం కావటం ఖరీఫ్ సీజన్, దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు.