న్యూఢిల్లీ: వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సోమవారం చెప్పారు. ది కేరళ స్టోరీ సినిమా విడుదల చేయరాదంటూ వివిధ రాష్ర్టాల్లో నిరసనలు తలెత్తుతున్నాయి.
ఈ సినిమా థియేటర్లలో విడుదలైతే రెండు వర్గాల మధ్య విద్వేషం, హింస చెలరేగే అవకాశం ఉన్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా వంటిదే బెంగాల్పైనా మరో సినిమా చేయడానికి బీజేపీ నిధులు సమకూర్చిందని మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే ది కేరళ స్టోరీ విడుదలను బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.