ఇండోర్, అక్టోబర్ 14: నవంబర్ 17న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో త్వరగా ఓటేసే వారికి ఇండోర్లోని ప్రముఖ ఫుడ్ హబ్ ‘56 దుకాణ్’ యజమానుల సంఘం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొమ్మిది గంటల లోపు ఓటు వేసి వచ్చిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు చెప్పింది.
ఓటింగ్ శాతంలో తమ నగరం అగ్రస్థానం పొందాలని ఈ ఆఫర్ను ఇస్తున్నట్టు 56 దుకాణ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజన్ శర్మ తెలిపారు. తొమ్మిది గంటల తర్వాత ఓటేసి వచ్చిన వారికి ఈ రెండు స్నాక్స్ను 10 శాతం రాయితీతో ఇస్తామని ఆయన చెప్పారు.