న్యూఢిల్లీ, మార్చి 27: ప్రభుత్వం కేటాయించిన ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసులు ఇచ్చింది. ఇందుకు 30 రోజుల సమయం ఇచ్చిన కమిటీ.. ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని పేర్కొన్నది. లోక్సభ ఎంపీల హౌసింగ్కు సంబంధి ంచిన వ్యవహారాలను పర్యవేక్షించే ఈ కమిటీకి గుజరాత్ బీజేపీ చీఫ్, ఎంపీ సీఆర్ పాటిల్ హెడ్గా ఉన్నారు.
రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి లోక్సభ ఎంపీగా 2004లో మొదటిసారి ఎన్నికయ్యారు. 2019లో కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందారు. ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్ వీధిలో 12వ నంబర్ బంగ్లా కేటాయించారు. ‘మోదీ’ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో ఇటీవల సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేండ్ల శిక్ష విధించిన నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియట్ ఈ నెల 24న ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీచేసింది.