రాంచీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరేన్ హామీ ఇచ్చారు. శుక్రవారం రాంచీలో సొరేన్ను కేజ్రీవాల్ కలిసారు.
అనంతరం సొరేన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడుతున్నదని విమర్శించారు. అప్రజాస్వామిక, సమాఖ్య వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ ఆర్డినెన్స్ను పార్లమెంట్లో విపక్షాలు ఐక్యంగా ఓడించాల్సిన అవసరం ఉన్నదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.