న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్లో అక్రమ మద్యం అమ్మకాల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కాంగ్రెస్ నేత రాయ్పూర్ మేయర్ ఎయాజ్ దేబర్ సోదరుడు అన్వర్, ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా మద్యం సిండికేట్లో కీలకప్రాత పోషించారని ఈడీ తాజాగా పేర్కొన్నది.
2019-22 మధ్య అక్రమ మద్యం వ్యాపారంతో ఈ సిండికేట్ 2 వేల కోట్లు అవినీతికి పాల్పడిందని రాయ్పూర్లోని స్పెషల్ కోర్టుకు తెలిపింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రైవేట్ వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది.