న్యూఢిల్లీ: గోవాలోని ఓ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై (Goa Nightclub Fire) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu), ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్లో (Goa Nightclub) జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
అగ్నిప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ఘటనలో కొందరు మృతిచెందడం బాధకరమని చెప్పారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Deeply pained by the tragic fire incident in North Goa district resulting in the loss of precious lives. My heartfelt condolences to the bereaved families. May they find strength during this difficult time. I pray for the speedy recovery of those injured.
— President of India (@rashtrapatibhvn) December 7, 2025
నైట్క్లబ్లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
The fire mishap in Arpora, Goa is deeply saddening. My thoughts are with all those who have lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Goa CM Dr. Pramod Sawant Ji about the situation. The State Government is providing all possible assistance to those…
— Narendra Modi (@narendramodi) December 7, 2025
ఉత్తర గోవాలోని అర్పోరాలోని రోమియో లేన్లో ఉన్న ప్రముఖ బిర్స్ నైట్ క్లబ్లో శనివారం అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 25 మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు. బాధుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు ఉన్నారు. మృతి చెందిన వారిలో 16 మంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితావారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.