యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారిగా సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మొదటి సారిగా సీతాపూర్ వచ్చారు. ఆయనే స్వయంగా కారు నడుపుతూ కనిపించారు. అయితే ఆయనకు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్ మధ్యలోకి సడెన్గా ఓ ఎద్దు వచ్చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన కారు వేగాన్ని తగ్గించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా యోగి పాలనపై విమర్శలు చేశారు. ‘మీ ప్రయాణంలో ఎద్దులు కూడా వచ్చేస్తాయి. నడవగలిగితే నడవండి. యూపీలో ప్రయాణించడం చాలా గగనమైపోతోంది’ అంటూ అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు.
యూపీ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని అఖిలేశ్ స్పష్టం చేశారు. బీజేపీ పాలించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా… ఇంకా మౌలిక సదుపాయాల సమస్యలే వున్నాయని ఎద్దేవా చేశారు. సమాజ్వాదీ పెరుగుతూనే వుందని, బీజేపీ తగ్గుతూ వస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం బాగా పెరిగిందని, దీన్ని బట్టే నైతిక విజయం సమాజ్వాదీకి దక్కుతుందని అఖిలేశ్ పేర్కొన్నారు.
सफ़र में साँड़ तो मिलेंगे… जो चल सको तो चलो…
बड़ा कठिन है यूपी में सफ़र जो चल सको तो चलो! pic.twitter.com/ZunRV6qlPa— Akhilesh Yadav (@yadavakhilesh) March 16, 2022