Akhilesh Yadav : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) పై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ‘ఇండియా కూటమి’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధాలకోరు పార్టీ బీజేపీ అని మండిపడ్డారు.
బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో 400కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ప్రచారం చేస్తుండటంపై కూడా అఖిలేష్ యాదవ్ స్పందించారు. ‘మీకు నిజంగా 400పైగా లోక్సభ స్థానాలు గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ను చూసి ఎందుకు భయపడుతున్నారు..?’ అని అఖిలేష్ ప్రశ్నించారు. ‘మీరు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను జైలుకు పంపారు. మీ తీరుపై కేవలం భారతీయులే కాదు, ప్రపంచమంతా విమర్శలు గుప్పిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
‘బీజేపీ నేతలు తమది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు. వాళ్లది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ కాదు. ఈ విశ్వంలోనే అతిపెద్ద అబద్ధాల కోరు పార్టీ’ అని విమర్శించారు. బీజేపీ తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ED, CBI, IT లను ఇదేవిధంగా వినియోగిస్తే.. వాళ్లు 400 సీట్లు గెలువలేరని, 400 సీట్లలో ఓడిపోతారని అన్నారు. ఈడీ, సీబీఐల వినియోగం కోసం బీజేపీ సర్కారు నిధులను భారీ పెంచిందని విమర్శించారు.
#WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, SP Chief Akhilesh Yadav says, “These people are giving the slogan of ‘400 Paar’. If you are going to win more than 400 seats, then why are you scared of the AAP leader… You have sent elected CMs to jail, not just the… pic.twitter.com/0bWntJedtA
— ANI (@ANI) March 31, 2024