హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్లో మొక్కలు నాటింది. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసింది. కంగనా రనౌత్ మొక్కలు నాటిన సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను.. కొన్నేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ట్విటర్లో షేర్ చేశారు.
‘దట్స్ అమేజింగ్ కంగనా రనౌత్ జీ..! గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటినందుకు చాలాచాలా కృతజ్ఞతలు. మీరు ఇవాళ చేసిన గొప్ప కార్యాన్ని చూసి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న మీ అభిమానులు కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారని భావిస్తున్నా. మంచి భవిష్యత్ ప్రయోజనాల కోసం మొక్కలు నాటుతారని ఆశిస్తున్నా’ అని ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్లో పేర్కొన్నారు.
That’s amazing #KanganaRanaut ji! Thank you so very much for planting saplings as part of our #GreenIndiaChallenge initiative. Hope your huge fanbase across PanIndia would replicate what you have done today in the interest of the better tomorrow.https://t.co/vZUBiMZmPz pic.twitter.com/JnQHgsUUp6
— Santosh Kumar J (@MPsantoshtrs) February 22, 2023
అదేవిధంగా కంగనా రనౌత్ కూడా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లో మొక్కలు నాటిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. హారా హై తో భారా హై, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలను స్వీకరిస్తూ తాను ఇవాళ ఉదయం హైదరాబాద్లో మొక్కలు నాటానని కంగనా పేర్కొన్నారు.
I’ve accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
And planted three saplings today morning in Hydrabad … pic.twitter.com/MPoeH91DaA— Kangana Ranaut (@KanganaTeam) February 22, 2023