శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో (Pulwama) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మేరకు గురువారం రాత్రి పుల్వామా జిల్లా అరిహల్లోని న్యూ కాలనీలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలో ఆయుధం, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడిని గుర్తించాల్సి ఉన్నదని, అతడు ఏ ఉగ్రసంస్థకు పనిచేస్తున్నాడనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని వెల్లడించారు.
On specific intelligence input, a joint operation was launched by Indian Army & Jammu and Kashmir Police on the intervening night of 30 Nov-01 Dec 23 at Arihal, Pulwama. Cordon laid & contact established. One terrorist has been eliminated along with the recovery of weapon and… pic.twitter.com/4xrQOfg23s
— ANI (@ANI) December 1, 2023