సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే సూర్యకిరణాలు బాణాల్లాగా పడడంతో మధ్నాహ్న సమయానికి నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతల వల్ల ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.1డిగ్రీలు, గాలిలో తేమ 29శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.