న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 (నమస్తే, తెలంగా ణ): సూడాన్లో అంతర్యుద్ధం కారణంగా భారత్కు తిరిగి వస్తున్న తెలంగాణవాసులను వారి స్వస్థలాలకు పంపించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఇందుకు ఢిల్లీలోని తె లంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల అం శంపై అన్ని రాష్ర్టాల రెసిడెంట్ కమిషనర్లను విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. ఢిల్లీ తెలంగాణభవన్లో అధికారులతో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
సూడాన్లో చిక్కుకున్న వా రు ప్రత్యేక విమానాల్లో తిరిగి వస్తున్నారని, ఇప్పటికే కొందరు సౌదీఅరేబియా, జెద్దాకు చేరుకున్నారని ఆయన తెలిపారు. రెండు విమానాల్లో జెద్దా నుంచి బుధవారం రాత్రి వరకు భారత్లోని ఢిల్లీ, ముంబైకి చేరుకొనే అవకాశమున్నదని చెప్పారు. వస్తున్నవారి లో నలుగురు తెలంగాణవాసులు ఉన్నట్టు సమాచారం ఉన్నదని చెప్పారు. వారికి సహా యం అందించేందుకు ఢిల్లీని తెలంగాణభవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న తెలంగాణవాసులను బస్సుల్లో తెలంగాణభవన్కు తరలిస్తామని తెలిపారు. హైదరాబాద్ పంపేందుకు విమాన టికెట్లు, ప్రయాణ సౌకర్యాలతోపాటు ఇతర ఏర్పా ట్లు చేస్తున్నామని వివరించారు. ఉక్రెయిన్ నుంచి వచ్చినవారిని ఏవిధంగా తెలంగాణకు పంపించామో.. అదే తరహాలో ఏర్పా ట్లు చేస్తున్నామని వెల్లడించారు.