హైదరాబాద్: ఏహెచ్-64 అపాచీ యుద్ధ హెలికాప్టర్ల(Apache Helicopter)కు చెందిన ఫ్యూసిలేజ్ బాడీలను హైదరాబాద్లోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్యూసిలేజ్ భాగానికి చెందిన 250వ బాడీని ఇవాళ డెలివరీ చేశారు. దీనిపై ఆ కంపెనీ ఇవాళ ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం ఫ్యూసిలేజ్లను టాటా కంపెనీ తయారు చేస్తోంది. అమెరికా ఆర్మీతో పాటు ఇతర దేశాలు కూడా ఆ బాడీలను కొనుగోలు చేస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ కూడా ఆరు అపాచీ ఫ్యూసిలేజ్లను ఆర్డర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో తమ కంపెనీ కట్టుబడి ఉందని టీబీఏఎల్ పేర్కొన్నది. స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నట్లు చెప్పింది. టాటా కంపెనీ రక్షణ ఉత్పత్తుల కోసం సుమారు 900 మంది ఇంజినీర్లను రిక్రూట్ చేసుకున్నది. దీంట్లో టెక్నీషియన్లు, రోబోటిక్స్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ నిపుణులు ఉన్నారు.
Tata Boeing Aerospace Limited (TBAL) has delivered the 250th fuselage for the AH-64 Apache attack helicopter from its state-of-the-art facility in Hyderabad.@Boeing_In #TASL #defencecapabilities #cuttingedgetechnologies #manufacturing #fuselage pic.twitter.com/4mHclQwVNX
— Tata Advanced Systems (Tata Aerospace & Defence) (@tataadvanced) December 20, 2023