న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు కొనసాగిస్తున్నారు. మేలో జరిగిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని పిలవకపోవడమే సనాతన ధర్మంలో కుల వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. హిందూ మతంలో సనాతన ధర్మ ఆచరణ పేరిట ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.