బీజేపీని వీడి సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారిగా స్పందించారు. గెలిచిన వారందరికీ ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలిచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు అత్యంత సహజమని వ్యాఖ్యానించారు. ఓటమిని తాను స్వీకరిస్తున్నట్లు స్వామి ప్రసాద్ ప్రకటించారు.
ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ఆత్మస్థైర్యం కోల్పోనని మౌర్య స్పష్టం చేశారు. ఏ విషయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీని వీడానో… ఇప్పటికీ ఆ సమస్యలున్నాయని, వాటిపై పోరాటం చేస్తూనే వుంటానని ఆయన తెలిపారు. ప్రజలు రాజకీయాన్ని అర్థం చేసుకున్న చోట్ల తీర్పు సరిగ్గానే వచ్చిందని వ్యాఖ్యానించారు.