న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో బుధవారం తెల్లవారుజామున 9 అంతస్తుల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ముగ్గురు మైనర్ బాలికలు కొరియన్ సంస్కృతితో విపరీతమైన వ్యామోహంలో పడ్డారని, తాము భారతీయ పౌరులం కాదని, తాము కొరియన్ యువరాణులమని వారు తమను తాము భావించుకునేవారని పోలీసులు గురువారం తెలిపారు. ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ల గదిలో లభించిన అనేక పుస్తకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పోలీసులు చెప్పారు.
ముగ్గురు బాలికలను నిషిక(16), ప్రాచి(14), పఖీ(12)గా పోలీసులు గుర్తించారు. కొవిడ్ 19 లాక్డౌన్ నాటి నుంచి ఈ బాలికలు స్కూలుకు వెళ్లడం లేదని పోలీసులు వెల్లడించారు.