శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని జమ్మూ-పూంచ్ జాతీయ రహదారిపై అనుమానాస్పద బ్యాగ్ను శుక్రవారం గుర్తించారు. భీంబర్ గాలి వద్ద ఆర్మీ శిబిరానికి సమీపంలో ఉన్న ఈ బ్యాగ్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. భద్రతా దళాలు, బాంబులను నిర్వీర్యం చేసే బృందం అక్కడకు చేరుకున్నారు. సంబంధిత నిబంధనల ప్రకారం అనుమానాస్పద బ్యాగ్ను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్ములోని పలు ప్రాంతాల్లో డ్రోన్ల కదలికలను గుర్తించిన నేపథ్యంలో ఈ అనుమానాస్పద బ్యాగ్ను సైనిక శిబిరం సమీపంలోని జాతీయ రహదారి వద్ద గుర్తించారు. ఆర్మీ వాహనాలను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు దీనిని ఉంచినట్లు అనుమానిస్తున్నారు.