అయోధ్య: శ్రీరామ నవమి ఉత్సవాలకు అయోధ్య రామాలయం ము స్తాబవుతున్నది. ఇది దాదాపు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో జరుగుతున్న అతి పెద్ద వేడుక కావడంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈసారి రామయ్య భక్తులు అపురూప ఘట్టాన్ని వీక్షించనున్నారు. 17న శ్రీరామ నవమి నాడు సూర్య భగవానుడు దాదాపు నాలుగు నిమిషాలపాటు బాల రాముడి నుదుటిపై కిరణాలు ప్రసరింపజేయనున్నాడు.
దీనినే సూర్యతిలకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శాస్త్రవేత్తల సమక్షంలో ఇందుకు సంబంధించి నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రతి శ్రీ రామ నవమి రోజున బాల రామయ్య నుదుటిపై సూర్యకిరణా లు ప్రసరించేలా ఏర్పాటు చేశారు.