న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సర్వోన్నత న్యాయస్థానం అల్టిమేటం జారీచేసింది. శివసేనలోని ఉద్ధవ్, షిండే వర్గాలు పరస్పరం తమ ప్రత్యర్థి వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్లపై ఎప్పటిలోగా తేల్చుతారో స్పష్టం చేయాలని ఆదేశించింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని స్పష్టంచేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తరపున మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా స్పీకర్తో మాట్లాడతానని, నిబంధనలను తెలియజేస్తానని చెప్పారు.