హైదరాబాద్ : పలు రాష్ట్రాల హైకోర్టుల్లోని న్యాయమూర్తులు బదిలీ కానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమై ఏడుగురు న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ను మద్రాస్ హైకోర్టుకు, మరో న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీకి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ హైకోర్టులో పని చేస్తున్న జడ్జి జస్టిస్ లలితను కర్నాటక హైకోర్టుకు, జస్టిస్ నాగార్జున్ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ అభిషేక్రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజాను రాజస్థాన్కు, మరో న్యాయమూర్తి జస్టిస్ వేలుమణిని కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ న్యాయశాఖకు సిఫారసు చేసింది.