(స్పెషల్ టాస్క్ బ్యూరో)గురుదాస్పూర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ):గెలవగానే కేంద్రం నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని చెబుతున్న బీజేపీ ప్రజాప్రతినిధుల మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఇందుకు పంజాబ్లోని గురుదాస్పూర్ నియోజవర్గ లోక్సభ సభ్యుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఉదాహరణ. ఆయన గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్కడి ప్రజలు ‘మా ఎంపీ కనిపించడం లేదు’ అంటూ పోస్టర్లేసి సన్నీడియోల్ను గోడెక్కించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.